లారీ ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడు మృతి

Jul 5 2025 6:04 AM | Updated on Jul 5 2025 6:04 AM

లారీ

లారీ ఢీకొని యువకుడు మృతి

ఓదెల: మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయ సమీపంలో లారీ ఢీకొని రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు (40 ) మృతిచెందాడు. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు.. రాజు కావేరి సీడ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓదెల నుంచి పెగడపల్లికి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుడికి భార్య శీరిష, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్‌లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్‌లోని రిషి ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

లారీ ఢీకొని యువకుడు మృతి1
1/1

లారీ ఢీకొని యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement