
ఓటరుకు శుభవార్త
● పక్షం రోజుల్లో ఇంటికే ఓటరు కార్డు ● ఎప్పటికప్పుడు సమాచారం
కరీంనగర్ అర్బన్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో ఓటరు కార్డు అందించాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓటర్లకు ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) చేసేందుకు నెలకు పైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 15 రోజుల్లో కార్డులు అందనున్నాయి. ఇందుకోసం ఈసీఐ నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) ని ప్రవేశపెట్టింది. ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో) ఎపిక్ జనరేట్ చేపట్టిన రోజు నుంచి పోస్టల్ విభాగం ద్వారా చేరేంతవరకూ ఓటరుకు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఆన్లైన్లో చేయడం ఇలా
ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్ నంబరు, మెయిల్ ఐడీతో సైనప్ కావాలి. క్రియేట్ చేసిన ఆకౌంటుపై క్లిక్ చేసి పేరు, పాస్వర్డును నమో దు చేయాలి. సైనప్ అయిన మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్ కావాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు (పారం–6) వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేయాలి. అందులో పేర్కొన్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. మరోసారి వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.
స్టేటస్ తెలుసుకోవచ్చు
ఎన్వీఎస్పీ పోర్టల్ మొబైల్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్ కావాలి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేయా లి. దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్ వచ్చిన రెఫరెన్స్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకొని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
మంచి అవకాశం
గతంలో ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేస్తే కార్డు చేతికి రావడానికి చాలా రోజులు పట్టేది. కొత్తగా నమోదు చేసుకున్న వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ఓటరు కార్డు రానుంది. కొత్తగా నమోదు చేసుకునేవారు, ఇదివరకు జారీ అయిన ఓటర్లు కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కుందారపు మహేశ్వర్,
ఆర్డీవో, కరీంనగర్