బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు

Jun 30 2025 4:21 AM | Updated on Jun 30 2025 4:21 AM

బాస్క

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టీజీఎన్పీడీసీఎల్‌ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి అండర్‌–19 బాలబాలికల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 30మంది బాలికలు, 35 మంది బాలురు పాల్గొన్నారు. బాలుర జట్టుకు భరత్‌రాజ్‌, అక్షిత్‌సాయి, సిద్ధార్థ, రిషి, త్రినేశ్‌, శివమణి, కౌశిక్‌, అఖిల్‌, సల్మాన్‌, స్పృహిత్‌, ఉమేశ్‌, సాయివిగ్నేశ్‌, స్టాండ్‌ బైగా సాయితేజ, రాఘవేంద్ర, రిత్విక్‌, అభినయ్‌ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు అక్షయ, ముగ్ధా, హాసిని, భద్ర బిబేశ్‌, త్రయ, మీనాక్షి సుహాక్షి, సహస్ర, మనాలి, అశ్విక, జస్లిన్‌, శాన్వి, అక్షిత, స్టాండ్‌ బైగా విధాత్రిరెడ్డి, విన్మయి, మాయ, సూర్యమిత్ర ఎంపికయ్యారు. వీరు జూలై 11 నుంచి 13 వరకు ఉత్తనూరు, గద్వాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ సెక్రటరీ బి.అనంతరెడ్డి ప్రకటించారు. సీనియర్‌ క్రీడాకారులు శ్రీధర్‌రావు, సత్యానంద్‌, సునీల్‌కుమార్‌, అరుణ్‌ తేజ, అభి, వెంకటేశ్‌, జీవన్‌, భార్గవ్‌, అనిల్‌, పరిమితకౌర్‌, జీవన్‌ కుమార్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి

కరీంనగర్‌: నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో లారీ డ్రైవర్లు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం లారీ అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగిన లారీ డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ఇవ్వడం కోసం మోటార్‌ వాహన సవరణ చట్టం 2019 తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం సవరణతో డ్రైవర్లకు హిట్‌ అండ్‌ రన్‌ చట్టం ప్రకారం జైలుశిక్ష, భారీ జరిమానా వేయాలని రూల్స్‌ చేశారన్నారు. డ్రైవర్లకు కనీస వేతనం చట్టం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్‌, సమ్మె హక్కు, యూనియన్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం లేబర్‌ కోడ్స్‌లో తీసుకొచ్చి అన్యాయానికి గురిచేసిందన్నారు. ఆనంతరం సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, పురుషోత్తం, రాజు, నారాయణ, శుభాని, అయ్యుబ్‌, అంజయ్య, లక్ష్మణ్‌, రావూస్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాడమాసం శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని కరివేపాకు మాలతో అలంకరించారు. ఆలయ పూజారులు విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, భక్తులు పాల్గొన్నారు.

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు
1
1/2

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు
2
2/2

బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement