
మాదిగలకు అండగా ఉంటా
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● అల్గునూర్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం
తిమ్మాపూర్: మాదిగలకు అన్నివిధాలా అండగా ఉంటానని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. అల్గునూరులో ఆదివారం మాదిగ అఫీషియల్ కాంగ్రెస్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదిగ సమాజ సంక్షేమం కోసం అందరికన్నా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. సామాన్య వ్యక్తిగా కష్టాలను అనుభవించిన తాను, ప్రజల సుఖదు:ఖాల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగలు గతంలో తమ గుర్తింపును చెప్పుకోలేని స్థితి నుంచి ఇప్పుడు గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవడం శుభపరిణామమన్నారు. ఈ ఘనత మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో సాధ్యమైందని కొనియాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ మాదిగ జాతి జాతీయ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిందని అన్నారు. సమ్మేళనంలో ప్రొఫెసర్ చింతకింది ఖాసీం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సోమన్న పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆది వారం స్థానిక టీఎన్జీవో భవన్లో రాష్ట్ర ఆంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్ల ర్ 145వ జయంతిని ఘనంగా నిర్వహించా రు. మంత్రి లక్ష్మణ్ కుమార్, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ను టీఎన్జీవోల జిల్లా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీని వాస్, కరీంనగర్ అంధ ఉద్యోగుల అధ్యక్షుడు గురుస్వామి, టీఎన్జీ వోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.