సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025
కరీంనగర్ కల్చరల్: డప్పు చప్పుళ్లు.. నెత్తిన బోనాలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాల మధ్య ఆదివారం నగరంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. కట్టరాంపూర్, బోయవాడ, భగత్నగర్, జ్యోతినగర్కు చెందిన ముదిరాజ్లు బోనాలతో తరలివచ్చారు. భగత్నగర్ భగత్సింగ్ విగ్రహం నుంచి అందరూ కలిసి భారీర్యాలీగా ఆలయానికి బయల్దేరారు. పెద్దమ్మ ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, గాజులు, నూతన వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పాల్గొని బోనం ఎత్తారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు మూల జయపాల్, నర్సయ్య, నాగరాజు, లింగయ్య, కనకయ్య పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో భక్తులు
ధర్మపురి: ఆషాఢ శుద్ధ చవితి ఆదివారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు.
బో ‘నమో’ పెద్దమ్మతల్లీ
బో ‘నమో’ పెద్దమ్మతల్లీ
బో ‘నమో’ పెద్దమ్మతల్లీ