
తాజా మాజీల రాజకీయం
● డివిజన్ల పునర్విభజనలో కీలక పాత్ర ● తమకు అనుకూలంగా డీలిమిటేషన్? ● బల్దియా అధికారుల తీరుపై అనుమానం ● కోర్టుకు వెళ్లేందుకు పలువురి సన్నాహం
కరీంనగర్ కార్పొరేషన్: అన్ని పార్టీల తాజా మాజీ కార్పొరేటర్ల కనుసన్నల్లోనే డివిజన్ల పునర్విభజన సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన తుది జాబితా వెల్లడి కాగా, శాసీ్త్రయంగా కాకుండా, మాజీ కార్పొరేటర్లకు అనుకూలంగా రూపొందించినట్లుగా ఆరోపణలు న్నాయి. 66 డివిజన్లలో సగానికి పైగా మాజీల ప్ర భావంతో రూపురేఖలు మారినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం కొందరు టౌన్ప్లానింగ్ అధికారులు నానా పాట్లు పడ్డారనే అభియోగాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందు కు, కోర్టుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
మాజీలకు అనుకూలంగానే
‘ఈ ఇంటి నంబర్ నుంచి ఆ ఇంటి నంబర్ వరకు నా డివిజన్. రాసి పెట్టుకోండి. ఇదే ఫైనల్ లిస్ట్లో ఉంటది.’ అంటూ ఓ మాజీ కార్పొరేటర్ పునర్విభజన ప్రక్రియ పూర్తికాక ముందునుంచి బలంగా చెబుతుండగా, అందుకు అనుగుణంగానే జాబితా రావడం పునర్విభజన జరిగిన తీరును తెలియజేస్తోంది. ప్రాథమిక జాబితా లీకు కావడంతోనే కొంతమంది మాజీలు అలర్ట్ అయ్యారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కావడంతో, డివిజన్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిపారు.
రిజర్వేషన్, గెలుపు కోసం
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉండాలని, తాము గెలవాలనే ఆలోచనతో మాజీ కార్పొరేటర్లు పునర్విభజనపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. కొంతమంది పట్టణ ప్రణాళిక అధికారుల సహకారంతో డ్రాఫ్ట్లో పేర్కొన్న ఇళ్లను ఇతర డివిజన్లో కలపడం, ఇతర డివిజన్లో ఉన్న అనుకూలమైన ఇళ్లను తమ డివిజన్లో కలపడంలో విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్ అవుతాయనే డివిజన్లలో ఇండ్ల మార్పి డి ఎక్కువగా జరిగినట్లు సమాచారం. కొన్ని డివిజ న్లలో తమకు అనుకూలమైన ఇళ్లను వీధులు దాటి మరీ కలుపుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏయే ప్రాంతాలు తమకు అనుకూలంగా ఉంటాయో చూ సుకొని, తమ డివిజన్లో ఉండేలా చూసుకొన్నారు.
శాసీ్త్రయత ఏదీ..?
నగరంలో ఆరుగ్రామాలు, ఒక పట్టణం విలీనం కావడంతో 60 డివిజన్లు 66గా మారడం తెలిసిందే. దీనితో డివిజన్ల పునర్విభజనను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రక్రి య కొనసాగింది. 21వ తేదీన కాకుండా, అదే తేదీ తో 27వ తేదీన డివిజన్ల హద్దులతో ఒక జాబితా, 28వ తేదీన ఇంటినంబర్లు, కాలనీలతో తుది జాబి తా రావడం తెలిసిందే. హద్దులతో రూపొందిన డివిజన్లు జాబితాకు, ఇంటినంబర్లు, కాలనీలతో వచ్చిన జాబితాకు వ్యత్యాసాలున్నట్లు ఆరోపణలున్నాయి. భౌగోళికంగా, పారిశుధ్య సేవలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాల కోసం డివిజన్లను శాసీ్త్రయంగా రూపొందించాల్సి ఉండగా, కేవలం రాజకీయ కోణంలోనే డివిజన్ల డీలిమిటేషన్ చేశారనే అపవాదును బల్దియా మూటకట్టుకొంది.
వ్యక్తుల కోణంలోనే పునర్విభజన
మాజీ కార్పొరేటర్లకు అనుకూలంగా డివిజన్లను పునర్విభజించారు. ముసాయిదాపై అభ్యంతరాలు చెబితే, అంగీకరించినట్లు చెప్పి, మళ్లీ తుది జాబితా లో పరిగణలోకి తీసుకోకుండానే రూపొందించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలున్నాయి. విచారణ జరిపి, శాసీ్త్రయంగా పునర్విభజన చేపట్టాలి. కేవలం వ్యక్తుల కోసం జరిగిన పునర్విభజనపై కోర్టును ఆశ్రయిస్తాం. – మహమ్మద్ ఆమీర్, సామాజిక కార్యకర్త

తాజా మాజీల రాజకీయం