పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ | - | Sakshi
Sakshi News home page

పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ

Jun 30 2025 4:21 AM | Updated on Jun 30 2025 4:21 AM

పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ

పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ

గోదావరిఖని:పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ.. ఇదీ రామగుండం పోలీస్‌కమిషనరేట్‌లో సెల్‌ఫోన్‌ రికవరీ పరిస్థితి. వారసంతలు, బస్‌స్టేషన్లు, రద్దీప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ ఎక్కువగా చోరీకి గురవుతున్నాయి. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు సంబందిత సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు సంబందిత పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ చోరీ చేసిన దొంగలు మరో అడుగు ముందుకేసి ఐఎంఈఐ నంబర్‌ తొలగించి వినియోగిస్తుండటంతో బాధితులకు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లు తిరిగి దక్కడం లేదు.

మోబైల్‌ ట్రాక్‌ ద్వారా రికవరీ

పోయిన సెల్‌ఫోన్‌ ఒరిజినల్‌ బిల్లుల ద్వారా ఐఎంఈఐ నంబర్‌తో ట్రాక్‌ చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ కాల్స్‌పై ట్రాక్‌ రికార్డింగ్‌ ఉంచడం ద్వారా గుర్తిస్తున్నారు. అయితే కొందరు సిమ్‌ వేసి ఆన్‌చేయకుండా వీడియోగేమ్‌లు, ఇతర పనులకు వినియోగిస్తుండటంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లు రికవరీ కావడం లేదు.

దొరికేది తక్కువే..

సీఈఐఆర్‌ పోర్టల్‌ రంగప్రవేశంలో సెల్‌ఫోన్‌ చోరీ లకు అడ్డుకట్టపడింది. అయినప్పటికీ రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో 6,683 మోబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వీటిలో 40శాతం మాత్రమే రికవరీ అయ్యాయి. పోగొట్టుకున్న సెల్‌ఫోన్లలో 2020 సెల్‌ఫోన్‌ మాత్రమే రికవరీ అయ్యాయి.

ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక విభాగం

పోయిన సెల్‌పోన్ల రికవరీ కోసం రామగుండం పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా ఏర్పాటు చేశారు. ఎవరైన సెల్‌పోన్‌ కోల్పోతే వెంటనే సీఈఐఎంఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సంబందిత పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని కోరుతున్నారు. వీటిపై నిఘా కోసం సీసీఎస్‌, ఐటీ సెల్‌ విభాగాలు పనిచేస్తున్నాయి.

సెల్‌ఫోన్‌ రికవరీలో వెనుకంజ

కమిషనరేట్‌లో పోయింది 6,683

రికవరీ అయిన 2,020 సెల్‌ ఫోన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement