
బైక్ను ఢీకొన్న కారు.. ఒకరికి గాయాలు
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం శివారులో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో రాజాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ మాతంగి ప్రభాకర్కు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రభాకర్ బైక్పై ఇంటికి వెళ్తుండగా కేశవపట్నం శివారులో స్పీడ్ బ్రేకర్ వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ కాలు విరిగిపోగా, ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని 108వాహనంలో హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ధర్మపురిలో..
ధర్మపురి: బైక్ను కారు వెనక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సబ్బు సత్తయ్య ఆదివారం పనులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కాగా, 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.