వర్షాకాలం అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం అప్రమత్తం

May 25 2025 12:09 AM | Updated on May 25 2025 12:09 AM

వర్షాకాలం అప్రమత్తం

వర్షాకాలం అప్రమత్తం

కొత్తపల్లి(కరీంనగర్‌): రానుంది వర్షాకా లం. విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సొంతంగా రిపేర్‌ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌ అధి కారులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో జరిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై టీజీఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు వివరించారు.

● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను తాకరాదు. ప్రమాదకరంగా ఉన్నటువంటి తీగలను గమనించిన వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు కాల్‌ చేయండి.

● ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ దండెము/వైర్లతో విద్యుత్‌తీగల్లో ఇన్సూలేషన్‌ సరిగ్గా లేకపోవడంతో విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ దండెములు ఉపయోగించాలి.

● ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్‌ సరఫరా జరిగే ప్రమాదం ఉంది. స్తంభం నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్తపడాలి.

● పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఒక వేళ కరెంట్‌ తీగలు కిందపడి ఉంటే పశువులు వాటిని తాకకుండా అప్రమత్తంగా ఉండాలి.

● ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్‌ చేయించాలి. నా ణ్యమైన ప్లగ్గులు, సెల్‌ఫోన్‌ చార్జర్లను ఉపయోగించాలి.

● సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి తడిచేతులతో తాకి మా ట్లాడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందునా చార్జింగ్‌ ఆఫ్‌ చేసి మాట్లాడాలి.

● పొరపాటున కరెంట్‌షాక్‌కు గురైతే దగ్గరలోని వ్యక్తులు రక్షించాలనే ఆతృతలో అతన్ని ముట్టుకో వద్దు. షాక్‌కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి వి ద్యుత్‌ ప్రవహించని కర్ర, ప్లాస్టిక్‌ వస్తువులను వాడాలి.

● వ్యవసాయబావుల వద్ద నాణ్యతలేని పంపుసెట్లను వాడొద్దు. కరెంటు మోటార్లు, ఫుట్‌ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్‌ విద్యుత్‌ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని ఏమరపాటున తాకవద్దు. వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్తింగ్‌ చేయించుకోవాలి.

● రైతులు, వినియోగదారులు సొంతంగా కరెంట్‌ పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజులు వేయడం వంటి పనులు రైతులు చేయొద్దు. విద్యుత్‌ సిబ్బందికి చెప్పి చేయించుకోవాలి.

● పొలాల చుట్టూ వేసే విద్యుత్‌ కంచెలతో రైతులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున రైతులు అప్రమతంగా ఉండాలి.

● విద్యుత్‌కంచె ఏర్పాటు చేయడం చట్టరీత్య నేరం.

● గ్రామీణులు విద్యుత్‌ సిబ్బంది లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ లైన్‌ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇంజినీర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలి.

వైర్లు తెగితే 1912కు కాల్‌ చేయాలి

సొంతంగా మరమ్మతు పనులు చేయొద్ద

కరీంనగర్‌ ఎస్‌ఈ రమేశ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement