
కల్వర్టును ఢీకొట్టిన కారు
● ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
మానకొండూర్: మండలంలోని రాఘవాపూర్ శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీకొనగా.. ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. పోలీసులు, స్థా నికుల వివరాల ప్రకారం.. పచ్చునూరు గ్రామానికి చెందిన దాసారం నర్సయ్య(62) సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నివాసం ఉంటున్నాడు. పచ్చునూరులో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మానకొండూర్కు చెందిన కోండ్ర సంజీవ్తో కలిసి కారులో బయల్దేరారు. కార్యక్రమంలో పాల్గొని మానకొండూర్కు తిరుగుపయనం అయ్యారు. మార్గంమధ్యలో రాఘవాపూర్ శివారులో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్క డే చనిపోయాడు. సంజీవ్కు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కల్వర్టును ఢీకొట్టిన కారు