కోర్టు భవనాలకు ముహూర్తం | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవనాలకు ముహూర్తం

May 8 2025 12:27 AM | Updated on May 8 2025 12:27 AM

కోర్ట

కోర్టు భవనాలకు ముహూర్తం

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్‌లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్‌’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్‌ అండ్‌ బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు కేటాయింపు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్‌

సాహో భారత్‌

ఆహ్లాదం కోసం కశ్మీర్‌ వెళ్లిన అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలకు భారత ప్రభుత్వం సరైన శిక్ష విధించిందని ఉమ్మడి జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. పహల్గాం మృతులకు ఇది ఘన నివాళిగా అభివర్ణించింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత భారత త్రివిధ దళాలు పాకిస్థాన్‌ ఉగ్రమూకలపై జరిపిన మెరుపుదాడిపై బుధవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. దాడికి ప్రతిదాడిగా మన రక్షణదళం బదులు తీర్చుకుందని ఆనందం వ్యక్తం చేశా రు. ‘సిందూర్‌’ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌ అదుర్స్‌ అంటూ.. సైనికులకు సెల్యూట్‌ చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా చౌరస్తాల్లో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సాహో భారత్‌ అంటూ.. నినాదాలు చేశారు.

– వివరాలు 8లోu

కరీంనగర్‌లో సంబురాలు జరుపుకుంటున్న యువత

పారదర్శకంగా రేషన్‌కార్డుల జారీ

నగరపాలకసంస్థ కమిషనర్‌, చాహత్‌ బాజ్‌పేయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ ఆదేశించారు. నగరంలోని 53,59,60 డివిజన్లలో జరుగుతున్న రేషన్‌కార్డుల లబ్ధిదారుల వెరిఫికేషన్‌ ప్రక్రియను బుధవారం తనిఖీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రకారం ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్‌ చేయడాన్ని స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వెరిఫికేషన్‌ చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దీన్‌ పాల్గొన్నారు.

డంప్‌యార్డ్‌ ప్రక్షాళనకు చర్యలు

డంప్‌యార్డ్‌ను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ తెలిపారు. బుధవారం నగరంలోని బైపాస్‌రోడ్డు ఆటోనగర్‌లో ఉన్న డంప్‌యార్డ్‌ను సందర్శించారు. డీఆర్‌సీ సెంటర్‌ను పరిశీలించారు. బయోమైనింగ్‌ ప్రక్రియపై సంబంధిత అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. డంప్‌యార్డ్‌కు నగరం నుంచి వచ్చే చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఈఈ సంజీవ్‌,డీఈ లచ్చిరెడ్డి, పర్యావరణ ఇంజినీర్‌ స్వామి పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్‌ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, యాదాద్రి సర్కిల్‌ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టెండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్‌ కాంట్రాక్ట్‌ కంపెనీలు భవన నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కోసం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు.

24 నెలల్లో పూర్తి..

ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్‌మెంట్‌ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్‌ చేసుకునేలా పార్కింగ్‌ లాట్‌), గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భవన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్‌లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్‌ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రూ.691.18 కోట్లతో..

మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్‌తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజసం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్‌తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్‌ కాలేజీ తరహాలో భవనం స్కెచ్‌ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్‌, ఎలక్ట్రిక్‌, సానిటరీ– వాటర్‌ వర్క్స్‌ కోసం దాదాపు రూ.53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్‌కు రూ.59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాలకు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ.563 కోట్లు సివిల్‌ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్‌ వర్క్స్‌ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు.

న్యూస్‌రీల్‌

కోర్టు భవనాలకు ముహూర్తం1
1/6

కోర్టు భవనాలకు ముహూర్తం

కోర్టు భవనాలకు ముహూర్తం2
2/6

కోర్టు భవనాలకు ముహూర్తం

కోర్టు భవనాలకు ముహూర్తం3
3/6

కోర్టు భవనాలకు ముహూర్తం

కోర్టు భవనాలకు ముహూర్తం4
4/6

కోర్టు భవనాలకు ముహూర్తం

కోర్టు భవనాలకు ముహూర్తం5
5/6

కోర్టు భవనాలకు ముహూర్తం

కోర్టు భవనాలకు ముహూర్తం6
6/6

కోర్టు భవనాలకు ముహూర్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement