ఉద్యోగ నియామకాలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

May 8 2025 12:27 AM | Updated on May 8 2025 12:27 AM

ఉద్యోగ నియామకాలు  చేపట్టాలి

ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

కరీంనగర్‌కల్చరల్‌: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌ బుధవారం అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ నియామకాలు, నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనుల గురించి చర్చించి, నియామ కాలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.

ఘనంగా అథ్లెటిక్స్‌ దినోత్సవం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్‌ సంఘం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. డీవైఎస్‌ఈ శ్రీనివాస్‌ గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. క్రీడలతో స్నేహ సంబంధాలు, అథ్లెటిక్స్‌తో శక్తి సామర్థ్యాలు, వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ ఇలాంటి పోటీల ద్వారానే బయటకు వస్తుందన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. కేక్‌ కట్‌చేశారు. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కడారి రవి, సభ్యులు హరికిషన్‌, ఎస్‌.రమేశ్‌, కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

ప్రతీ ఇంటినుంచి ఆర్థికసాయం అందించాలి

కరీంనగర్‌: దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటినుంచి ఆర్థికసాయం అందించాలని మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ కోరారు. సైనికుల సహా యార్థం సిక్కుల తరఫున రూ.13,013 చెక్కు ను బుధవారం కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌సింగ్‌ మా ట్లాడుతూ ఒక వైపు మన సైనికులు యుద్ధ భూ మిపై పోరాడుతుంటే, సాధువులు జీవన భూ మిపై పోరాడుతున్నారన్నారు. మనం చేసే ఈ చిన్న ప్రయత్నం తరాలు గుర్తుండి పోయేలా ఉండాలన్నారు. గురుద్వార్‌ ప్రబందు కమిటీ సభ్యులు సర్దార్‌ బిషన్‌సింగ్‌ పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,550

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.7,550 పలికింది. బుధవారం మార్కెట్‌కు 10వాహనాల్లో 143 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.7,500, కనిష్ట ధర రూ.7,100కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 రాజా పర్యవేక్షించారు.

నేడు పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ నిర్వహణ పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ ఎల్లమ్మ ఫీడర్‌ పరిధిలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం, కోతిరాంపూర్‌, మై విలేజ్‌, ఆటోనగర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌– ఏడీఈ పి.శ్రీనివాగౌడ్‌ తెలిపారు. విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 11 కే.వీ.సంతోష్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని జ్యోతినగర్‌, గీతాభవన్‌ వెనకభాగం, కార్పెంటర్స్‌ సొసైటీ ప్రాంతాలు, ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.తెలంగాణ చౌక్‌ ఫీడర్‌ పరిధిలోని కాశ్మీర్‌గడ్డ, ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల మెయిన్‌రోడ్‌, మైసమ్మ చెట్టు, రైతు బజార్‌, ముకరంపుర, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement