బ్యాంకులో చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకులో చోరీకి యత్నం

Apr 27 2025 12:44 AM | Updated on Apr 27 2025 12:44 AM

బ్యాం

బ్యాంకులో చోరీకి యత్నం

మానకొండూర్‌: శుక్రవారం అర్ధరాత్రి ఓ దొంగ కొండపల్కల గ్రామంలోని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు తాళం పగలగొట్టి చోరీకి యత్నించాడు. గ్రామ స్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఓ దొంగ టీషర్టు ధరించి బ్యాంకు ఆవరణలోకి చొరబడ్డాడు. ముందుగా బ్యాంకు షట్టర్‌ను తెరిచేందుకు ఓ తాళాన్ని పగలగొట్టాడు. మరో తాళం తీసే క్రమంలో శబ్ద కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ బి.సంజీవ్‌ పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

ప్రభుత్వ ఫార్మసిస్టులు.. ఇక ఫార్మసీ ఆఫీసర్స్‌

● ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

కరీంనగర్‌టౌన్‌: ప్రభుత్వ ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్స్‌గా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం హెల్త్‌, మెడికల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం జీవోఎంఎస్‌ నం.71 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వ ఫార్మసిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రామారావు ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, హెల్త్‌ సెక్రటరీ, హెల్త్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, టీవీవీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న వ్యక్తులు..?

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కృష్ణానగర్‌లో శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యారు. అదుపులో ఉన్న వ్యక్తులను పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

అంత్యక్రియల్లో మరో విషాదం

స్నేహితుడి కుమారుడి అంతిమ యాత్రకొచ్చిన వ్యక్తి మృతి

హుజూరాబాద్‌: స్నేహితుడి కుమారుడు మృతిచెందాడని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతిచెందడం హుజూరాబాద్‌లో కలచివేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ముద్రవేన రాజశేఖర్‌(18) ఈనెల 19న తోకలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు డివైడర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. రాజశేఖర్‌, హరిచరణ్‌ ఇద్దరు గాయపడ్డారు. రాజశేఖర్‌ను మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలించగా, హరిచరణ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రాజశేఖర్‌ శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజశేఖర్‌ తండ్రి, హుస్నాబాద్‌కు చెందిన ఇస్లావత్‌ వెంకట్‌(40) స్నేహితులు కాగా.. రాజశేఖర్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెంకట్‌ శనివారం హాజరయ్యారు. మృతుడి ఇంటి సమీపంలోని మురుగు కాలువలో వెంకట్‌ హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

బ్యాంకులో చోరీకి యత్నం 1
1/2

బ్యాంకులో చోరీకి యత్నం

బ్యాంకులో చోరీకి యత్నం 2
2/2

బ్యాంకులో చోరీకి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement