
శ్రీచైతన్య విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్చార్జి తిరుపతి తెలిపారు. అలుగునూర్లోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో మాట్లాడారు. విద్యార్థులు వై.భరణిశంకర్ జాతీయస్థాయిలో 88వ ర్యాంకు, బి.సురేశ్ 98, ఎ.కార్తిక్ 584, లకావత్ మాధవ్చరన్ 707, లునావత్ రామ్చరణ్ 777, పత్తెం హృషికేశ్ 796వ ర్యాంకు సాధించగా, మరో ఏడుగురు 6 వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వివరించారు. ఇంతటి విజయాన్ని అందించి, కళాశాలకు పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్ఆర్ ప్రభంజనం

శ్రీచైతన్య విజయకేతనం