వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎనిమిది రోజులపాటు శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అభిషేకాలు, నిత్యకల్యాణాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆర్అండ్ఆర్ కమిషనర్(ఐఏఎస్) టి.వినయ్కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. వేములవాడ అర్బన్ తహసీల్దార్ విజయ్ప్రకాశ్రావు, ప్రొటోకాల్ ఏఈవో అశోక్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, శ్రీకాంతాచారి, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గొట్టం గిరి పాల్గొన్నారు.
కల్యాణోత్సవం సందర్భంగా నిర్ణయం