కోరుట్ల: పట్టణంలోని కృష్ణ మందిరం వద్ద జాతీయ రహదారిపై శనివారం గౌతమ్ హైస్కూల్కు చెందిన బస్సు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. బస్సులో డ్రైవర్, క్లీనర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాలు.. స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు చేర్చి వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా డ్రైవర్ మారుతి బస్సు వేగంగా నడపడంతో రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. బస్సు ముందుభాగం దెబ్బతింది. ట్రాన్స్ఫార్మర్ కిందపడి పేలింది. విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.