కనువిందు చేసిన సింగిడి
జిల్లాలో శుక్రవారం మబ్బులు కమ్మిన ఆకాశంలో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. ఓవైపు ఎండ దంచి కొడుతుండగా.. మరోవైపు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులు అలికిడి చేశాయి. తర్వాత చిటపట చినుకులు వాతావరణాన్ని చల్లబరిచాయి. ఇదే సమయంలో రంగురంగుల హరివిల్లు విచ్చుకోవడం కనువిందు చేసింది. రామడుగు మండలం వెదిరలో సాయంత్రం కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – రామడుగు
న్యూస్రీల్
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025