మాకు ఒక కూతురు, ఐదుగురు కుమారులు. ఉన్నంతలో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే ఆస్తుల కోసం ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామంలో రైస్ మిల్ ఉండగా ఐదుగురికి సమాన వాటా ఇచ్చాం. ఇందుకు ప్రతినెలా రూ.3వేలు ఇవ్వాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. హుజూరాబాద్ ఆర్డీవోను కలిస్తే చర్యలు లేవు. ఇటీవల పెద్ద కుమారుడు దుర్భాషలాడుతూ ఇంటి నుంచి గెంటేసి ఇల్లే తనదని బెదిరిస్తున్నాడు. తెలిసినవారి ఇంట్లో తలదాచుకుంటున్నం. వృద్ధుల చట్టమని అంటున్నారు కానీ మాకు న్యాయమేది.?
– వేముల రామలింగం–పోచమ్మ
దంపతులు, చల్లూర్, వీణవంక
ఆదేశాల అమలేదీ ?
మాకు 9.20 ఎకరాల భూమి ఉండేది. నా కొడుకు, కోడలు ఆస్తి కోసం తప్ప ఏనాడూ మమ్మల్ని పట్టించుకోలేదు. నా భర్త మల్లారెడ్డిని సరిగా సాదకపోవడం వల్లే మరణించారు. గతంలో ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే, పెద్దమనుషుల మధ్యలో మాట్లాడి 9.20 ఎకరాల భూమిలో 2 ఎకరాలను మా పేరున ఉంచాలని, రూ.8వేలు ప్రతినెలా భత్యం ఇవ్వాలని చెప్పారు. ఏదీ అమలు కాలేదు. పైగా ఉన్న 2ఎకరాల భూమిని వారి పేరున మార్చుకున్నారు. నా కూతురు, మనవని దగ్గర ఉంటే వారిని ఇబ్బంది పెడుతున్నారు. నా రెండెకరాల భూమి నా పేరున ఉంచడంతో పాటు భత్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– గుర్రాల అంతమ్మ, కొండపల్కల,
మానకొండూరు
ఇంట్లో నుంచి గెంటేశారు