రైలు కిందపడి యువతి, యువకుడి ఆత్మహత్య? | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువతి, యువకుడి ఆత్మహత్య?

Mar 16 2025 12:26 AM | Updated on Mar 16 2025 12:25 AM

జమ్మికుంట: రైలు కిందపడి గుర్తు తెలియని యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌, పాపయ్యపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలో బిజిగిరిషరీషఫ్‌, పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని యువతీ(19), యువకుడు(23) రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు కిందపడి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement