జమ్మికుంట: రైలు కిందపడి గుర్తు తెలియని యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలో బిజిగిరిషరీషఫ్, పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వేట్రాక్పై గుర్తుతెలియని యువతీ(19), యువకుడు(23) రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్రైలు కిందపడి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.