సెల్‌ఫోన్లు చోరీ చేసి.. డబ్బులు మాయం చేసి | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్లు చోరీ చేసి.. డబ్బులు మాయం చేసి

Sep 22 2023 2:00 AM | Updated on Sep 22 2023 2:00 AM

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీలు నరేందర్‌, మాధవి - Sakshi

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీలు నరేందర్‌, మాధవి

కరీంనగర్‌క్రైం: సెల్‌ఫోన్లు చోరీచేస్తూ.. అందులోని బ్యాంకు ఖాతాల్లో గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా డబ్బులు మాయం చేస్తున్న ముఠాను కరీంనగర్‌ వన్‌టౌన్‌, సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌లో నిందితుల వివరాలను టౌన్‌ ఏసీపీ జి.నరేందర్‌, సీసీఎస్‌ ఏసీపీ మాధవి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన బేతంపల్లి ఎల్లప్ప, వికారాబా ద్‌ జిల్లా చౌదాపూర్‌ మండలం తండాకు చెందిన వడ్డె శ్రీనివాస్‌, హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన మాతాజీ శివ, హెదరాబాద్‌కు చెందిన బోయ మురళీ, చిన్నా, బేతంపల్లి భూలక్ష్మి హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ జిల్లాలు తిరుగుతూ రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు దొంగలించడం ప్రారంభించారు. ఈ నెల 17న కరీంనగర్‌ కూరగాయల మార్కెట్లో వినోద్‌రెడ్డి అనేవ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ దొంగలించారు. ఫోన్‌లోని యాప్‌ ద్వారా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.10లక్షలు మాయం కావడంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌, సీసీఎస్‌ పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఎల్లప్ప, వడ్డె శ్రీనివాస్‌, శివ, మురళీ సికింద్రాబాద్‌లో గంజాయి కొనుగోలు చేసి కారులో కరీంనగర్‌ వస్తున్నారన్న పక్కా సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్‌లో నిందితులు పట్టుబడి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి, దుబ్బాకతో పాటు పలు ప్రాంతాల్లో 85 సెల్‌ఫోన్లు దొంగలించామని ఒప్పుకున్నారు.

సెల్‌ఫోన్ల ద్వారా నగదు మాయం

సెల్‌ఫోన్లు చోరీ చేసి వివిధ రకాల పాస్‌వర్డ్‌లతో ఫోన్‌పే, గూగుల్‌ పే, ఇతర మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ లు ఓపెన్‌ చేసి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు దొంగలించే ప్రయత్నం చేశారు. రెండు సెల్‌ఫోన్లలో పాస్‌వర్డ్‌లు సులభంగా ఉండడంతో కరీంనగర్‌లో దొంగలించిన సెల్‌ఫోన్‌లోని ఫోన్‌పే నుంచి రూ.2.10లక్షలు, దుబ్బాకలో దొంగలించిన ఓ సెల్‌ఫోన్‌ నుంచి రూ.లక్ష కాజేశారు. నిందితుల నుంచి 85సెల్‌ఫోన్లు, కిలోన్నర గంజాయి, రూ.45వేల నగదు, గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని రిమాండ్‌ చేశామని, చిన్నా, బేతంపల్లి భూలక్ష్మి పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు రవికుమార్‌, లింగమూర్తి, పుల్లయ్య, ఎస్సైలు స్వామి, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

85 సెల్‌ఫోన్లు, కిలోన్నర గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడించిన కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ నరేందర్‌, సీసీఎస్‌ ఏసీపీ మాధవి

 పట్టుబడిన గంజాయి, సెల్‌ఫోన్‌లు, గొడ్డలి1
1/1

పట్టుబడిన గంజాయి, సెల్‌ఫోన్‌లు, గొడ్డలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement