జూనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకం | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకం

Sep 22 2023 2:00 AM | Updated on Sep 22 2023 2:00 AM

కరీంనగర్‌క్రైం: ఇటీవల నూతనంగా నియామకమైన 39 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలను రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కోర్టుల్లో నియమి స్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 9 కోర్టులకు వీరిని కేటాయించింది. నంది మేడారం జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నల్లా ల వెంకట సచిన్‌రెడ్డి, హుజూరాబాద్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పద్మశాయిశ్రీ, కోరుట్ల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా కాసుల్ల పావ ని, సిరిసిల్ల అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా కావేటి సజన, కరీంనగర్‌ స్పెషల్‌ ఎకై ్సజ్‌ కోర్టు మేజిస్టేట్‌గా బానోత్‌ రాజేశ్వర్‌, కరీంనగర్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా దామెర్ల ప్రీతిని నియమించారు. హుజూరాబాద్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న పాలడుగు అలేఖ్యను అక్కడే ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. సిరిసిల్ల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి హిమబిందు ముదావత్‌ను రంగారెడ్డి మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్‌ కోర్టు కు బదిలీ చేయగా, ఈస్థానంలో నాగర్‌ కర్నూ ల్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీ ణ్‌ అరవను నియమించారు. వీరంతా 4వ తేదీ లోపు జాయిన్‌ కావాలని సూచించారు.

మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి

తిమ్మాపూర్‌: మహిళా బిల్లు అమలుకు జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరికాద ని, వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ నగేశ్‌ కోరారు. పదేళ్ల తర్వాత అమలు చేస్తే.. ప్రస్తుతం బిల్లుపెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేసి మహిళలపై ఉన్న గౌరవాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి

కరీంనగర్‌: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి కోరారు. గురువారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ రేషన్‌ షాపుల్లో 14 రకాల సరుకులను ఇవ్వాలని, పెరిగిన ధరలతో పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు కనీసం రెండు పూటలు తినలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికీ 10 కేజీల సన్న బియ్యం, మంచి నూనె, గోధుమలు, పంచదార, చింతపండు, కందిపప్పు, కారం,పసుపు ఉప్పు తదితర 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

26 వరకు ఓపెన్‌స్కూల్‌ సప్లిమెంటరీ

కరీంనగర్‌: తెలంగాణ ఓపెన్‌స్కూల్‌ సొసైటీ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్‌ 16 నుంచి 26వరకు ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సోసైటీ డైరెక్టర్‌ పీవీ శ్రీహరి, డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు, ఉమ్మడి జిల్లా ఓపెన్‌స్కూల్‌ కో ఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌ సైన్స్‌, ఓకేషనల్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 6 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

23న మిగిలిన సీట్ల భర్తీ

తిమ్మాపూర్‌: తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 23న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి మేరీ తెలిపారు. వీటీజీసెట్‌, బీఎల్‌బీ సెట్‌ పరీక్ష రాసి అడ్మిషన్‌ తీసుకోని వారు, ఎస్సీ ఆర్షన్‌, సెమీ ఆర్షన్‌, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు సీటు వచ్చిన కాపీ, హాల్‌ టికెట్స్‌, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌, ఇతర పత్రాలతో 23న చింతకుంట గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement