లక్ష్మణ్‌ బాపూజీకి నివాళి | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ బాపూజీకి నివాళి

Sep 22 2023 1:34 AM | Updated on Sep 22 2023 1:34 AM

- - Sakshi

కరీంనగర్‌: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా గురువారం నగరంలోని బైపాస్‌ వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి మేయర్‌ సునీల్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ, వాసాల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మినీ హైమాస్ట్‌ లైట్లు ప్రారంభం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని 18, 20 డివిజన్‌లలో ఏడు చోట్ల ఏర్పాటు చేసిన మినీ హైమాస్ట్‌ లైట్లను గురువారం మేయర్‌ సునీల్‌రావు ప్రారంభించారు. విలీన డివిజన్‌లలోనూ మినీ హైమాస్ట్‌ లైట్ల వెలుగులు పంచుతున్నాయని తెలిపారు. కార్పొరేటర్లు సుదగోని మాధవి కృష్ణగౌడ్‌, తుల రాజేశ్వరిబాలయ్య, అధికారులు పాల్గొన్నారు.

తూమ్‌ నారాయణకు

పాన్‌ ఇండియా అవార్డు

కరీంనగర్‌కల్చరల్‌: అక్కినేని నాగేశ్వరరావు జ యంతి పురస్కరించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సీనియర్‌ అక్కినేని అభిమానులకు పాన్‌ఇండియా అవా ర్డు ప్రదానం చేశారు. కరీంనగర్‌ చెందిన సీని యర్‌ అక్కినేని అభిమాని తూమ్‌ నారాయణ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి చేతుల మీ దుగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో తెలుగు సినిమా వేదిక అధ్యక్షుడు చైతన్య జంగా, సెక్రటరీ విజయశర్మ సినీనటులు మురళీ మోహన్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

స్వాతి కట్టకు డాక్టరేట్‌

కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలోని కామర్స్‌ విభాగం నుంచి స్వాతి కట్టకు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు విభాగం అధికారులు గురువారం తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి స్వాతి కట్ట, రీసెర్చ్‌ స్కాలర్‌ డాక్టర్‌ డి.హరికాంత్‌, హెడ్‌ అండ్‌ చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ గైడ్‌ షిప్‌లో ‘ఇంపాక్ట్‌ అఫ్‌ ఆర్గనైజ్డ్‌ రిటైలింగ్‌ ఆన్‌ అనార్గనైజ్డ్‌ రిటైలింగ్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ విత్‌ రిఫరెన్స్‌ టు కన్జ్యూమర్‌ పర్స్పెక్టివ్‌’ అంశంపై పరిశోధన నిర్వహించినందుకు పీహెచ్‌డీ అందజేసినట్టు ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రంగప్రసాద్‌ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ సంకసాల మల్లేశ్‌, రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వరప్రసాద్‌, పరీక్షల నియంత్రణ అధికారి ఎన్వీ రంగ ప్రసాద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ విభాగాధిపతి, చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ హరికాంత్‌, లైబ్రేరియన్‌ ఇన్‌చార్జ్‌ రతన్‌ జ్యోతిలు స్వాతి కట్టాను అభినందించారు.

ప్రమాణ స్వీకారం

సప్తగిరికాలనీ: లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా 320జీ కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటైన ఐదు క్లబ్‌ల నూతన కార్యవర్గాలు గురువారం టీటీడీ కల్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేశాయి. శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరావు, నారాయణరెడ్డి, రాజిరెడ్డి, అశోక్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో డిస్టిక్‌ గవర్నర్‌ హనుమండ్ల రాజిరెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వరరావు, సింహరాజు, కోదండరామ్‌, సురేష్‌, కొండ వేణు మూర్తి, మంద వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న మేయర్‌ సునీల్‌రావు1
1/2

నివాళి అర్పిస్తున్న మేయర్‌ సునీల్‌రావు

అవార్డు అందుకుంటున్న తూమ్‌ నారాయణ 2
2/2

అవార్డు అందుకుంటున్న తూమ్‌ నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement