
మాట్లాడుతున్న మార్కెట్ చైర్మన్ మధు
కరీంనగర్ అర్బన్: రైతులు, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ కృషి చేస్తోందని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేణి మధు అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో హోల్సేల్ కూరగాయల అడ్తిదారులతో సమావేశం నిర్వహించారు. కూరగాయల మా ర్కెట్లో నూతనంగా నిర్మించనున్న అడ్తి దుకాణా లపై చర్చించారు. వాహనాల పార్కింగ్ సమస్యలకు పరిష్కార మార్గాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పాల్గొన్నారు.