6నుంచి పీజీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నవంబర్ 6 నుంచి 17వరకు కొనసాగుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.
కామారెడ్డి రూరల్: అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, సెర్ప్ టీం సభ్యులతో కలసి మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిశారు. పూలమొక్కను అందజేశారు. మండల సమాఖ్యలు, గ్రామ సంస్థల బలోపేతం కోసం సెర్ప్–టీజీ–ఐబీ యూనిట్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2025–26 సంసిద్ధతలో భాగంగా ఈ నెల 29 నుంచి స్టేట్ టీమ్ జిల్లాలో పర్యటన సందర్భంగా కలెక్టర్ను కలిసి కార్యక్రమం వివరాలను వివరించినట్లు వారు తెలిపారు.


