యూరియా.. లేదయ! | - | Sakshi
Sakshi News home page

యూరియా.. లేదయ!

Sep 9 2025 8:41 AM | Updated on Sep 9 2025 8:41 AM

యూరియ

యూరియా.. లేదయ!

ఆందోళనకు దిగుతున్న రైతులు.. పోలీసు పహారాలో పంపిణీ... ప్రైవేటు వ్యాపారుల బ్లాక్‌ దందా! సమస్య పరిష్కారమవుతుంది

న్యూస్‌రీల్‌

– 8లో u

మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

మాచారెడ్డిలో వరుసలో ఉన్న రైతులు

జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత

ఇబ్బందిపెడుతోంది. అవసరమైన

సమయంలో ఎరువు లేకపోవడంతో

అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోజూ సొసైటీల చుట్టూ తిరుగుతున్నా

బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత తీర్చాలని అధికారులను కోరుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో సాగు చే సిన పంటలకు అవసరమైన మేర యూరియా సర ఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి వేళలోనే సొసైటీకి చేరుకుని అక్కడే ఉండి పొద్దున్నే వరుసలో నిల్చుంటున్నారు. మరికొన్ని చోట్ల చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలు, పాసుపుస్తకాల జిరాక్సులను వరుస లో పెడుతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, రామారె డ్డి, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెరువులు, ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలతో కొంత నష్టం జరిగినా, ఉన్న పంటలకు ఎరువులు వేయాలని రైతులు సహ కార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్‌కు మించి రైతులు వస్తుండడంతో ఒక్కో బస్తా చొప్పు నే పంపిణీ చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా చాలామందికి దక్కడం లేదు.

ఎరువులు దొరకని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయిలో రైతులు సోమవారం యూరియా కోసం ధర్నా చేశారు. అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలోనూ రైతులు రోడ్డెక్కారు. మరికొన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రోజూ యూరియా కోసం రైతు లు ఊళ్ల నుంచి సొసైటీల వద్దకు చేరుకుంటున్నా రు. ఎరువు లోడ్‌ వస్తుందని చెబితే చాలు వరుస కడుతున్నారు. తీరా లోడ్‌ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒక్క బస్తా కోసం నాలుగైదు రోజులుగా తిరుగుతున్నవారూ ఉన్నారు. పొలం దగ్గరకు వెళ్లాల్సిన రైతులు.. ఎరువుల కోసం సొసైటీల వద్ద పొద్దంతా గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాచారెడ్డి మండల కేంద్రంలోని సహకార సంఘానికి సోమవారం భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూ పన్లు ఇవ్వడానికి అధికారులు పోలీసుల సాయం తీసుకున్నారు. అక్కడ రైతులు, పోలీసులకు మధ్య న పలుమార్లు వాగ్వాదం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతోనూ రైతులు గొడవకు దిగారు. చాలాచోట్ల రోజూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు వ్యాపారులు ముందుగానే యూరియాను బ్లాక్‌ చేసి ఉంచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎ క్కువ డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఎరువులు స్టాక్‌ చేసి ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. నిఘా ఉంచి బ్లాక్‌ దందా ను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

జిల్లాలో 48 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవ సరం ఉండగా.. ఇప్పటికే 46 వేల మెట్రిక్‌ టన్నులు వచ్చింది. దానిని రైతులకు అందించాం. మంగళవా రం మరో 800 మెట్రిక్‌ టన్నుల యూరియా రానుంది. ఆయా సొసైటీలకు సరఫరా చేసి రైతులకు పంపిణీ చేస్తాం. బ్లాక్‌ మార్కెట్‌ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా బ్లాక్‌మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

మాచారెడ్డిలో పోలీసుల సహకారంతో రైతులకు టోకెన్లు ఇస్తున్న

సొసైటీ అధికారులు

వేధిస్తున్న కొరత

ఇబ్బందిపడుతున్న రైతులు

బస్తా కోసం గంటల తరబడి బారులు

అయినా దక్కక నిరాశ

యూరియా.. లేదయ!1
1/2

యూరియా.. లేదయ!

యూరియా.. లేదయ!2
2/2

యూరియా.. లేదయ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement