పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Sep 8 2025 4:52 AM | Updated on Sep 8 2025 4:52 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1996–97 విద్యార్థులు ఆదివారం స్థానిక వీరభద్ర ఫంక్షన్‌హాల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులంతా 28 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు.ఒకరినొకరు ఆ ప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం తమకు చదువు చెప్పి న ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీ ర్వాదం పొందారు. వచ్చే ఏడాది కుటుంబీకులతో క లిసి సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించుకున్నా రు. పాఠశాల అభివృద్ధికి సైతం కృషిచేస్తామన్నారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. మిత్రులంతా ఏళ్ల త ర్వాత కలుసుకోవడంతో ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యకమ్రాలు, వింధులతో ఉత్సాహంగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement