ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

Sep 7 2025 7:52 AM | Updated on Sep 7 2025 7:52 AM

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

నలుగురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి క్రైం: గణేష్‌ శోభాయాత్ర కోసం తీసుకువెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీని లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద ప్రధా న రోడ్డుపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి నుంచి ట్రాక్టర్‌ ట్రాలీని కొంద రు యువకులు కలిసి దోమకొండకు తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో నలుగురు యువకులు ట్రాక్టర్‌ ఇంజిన్‌పై కూర్చుని ప్రయాణిస్తున్నారు. క్యాసంపల్లి వద్ద వారి ట్రాక్టర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దోమకొండ కు చెందిన సాయికుమార్‌, శ్రీధర్‌, రాజయ్య, శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసు లు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గా యపడిన వారిలో శ్రీధర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement