
రైళ్లను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ స్థాయి సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. సికింద్రాబాద్లో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పలు వినతులు అందించారు. నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు.తిరుపతికి వందే భారత్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింకు కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలో ప్లాట్ల యజమాన్లకు న్యాయం చేయాలన్నారు. తపోవన్ ఎక్స్్ప్రెస్, పూణే, ముంబై ఎక్స్్ప్రెస్లను, బెంగుళూరు, ఢిల్లీ రైళ్లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు. ముంబై సికింద్రాబాద్ మధ్య మరొక రైలు నడపాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్, సీసీ కెమెరాలు స్కానింగ్ ప్రయాణికుల వసతులు తదితర వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాల ని కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్నాగారం: నిర్మల్లో ఈ నెల 5 నుంచి 7 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగాసన పోటీలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి 20 మంది యోగా క్రీడాకారులు గురువారం నిర్మల్ తరలివెళ్లారు. జిల్లా జట్టుకు కోచ్గా ఉమారాణి, శివ కుమార్ వ్యవరిస్తున్నారు. వీరితోపాటు టెక్నికల్ అఫీషియల్స్గా ఎంపికై న ఏడుగురు జిల్లా నుంచి వెళ్లారు. అంతకుముందు క్రీడాకారులను జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యోగా రాంచందర్, ప్రతినిధులు గంగాధర్, జ్యోతి, రసజ్ఞ అభినందించారు.