రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పిట్లం: పటాన్చెరు సమీపంలో బొలెరో వాహనం ఢీ కొని పిట్లం మండలం హస్నాపూర్కు చెందిన శివ(28) అనే యువకుడు మృతి చెందిన ఘటన బువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివను వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: సారంగపూర్ హనుమాన్ ఆలయం గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి(65–70) చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ నెల 1న గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
పాత కలెక్టరేట్లో గంజాయి విక్రయం!
ఖలీల్వాడి: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వచ్చినట్లు ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి విక్రయానికి వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రావడంతో పరారైన చోట ఉంచిన బైకులో 20 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. బైక్, చుట్టూ పక్కల ఉండే సీసీటీవీ పుటేజీ ఆధారంగా గంజాయి అమ్మే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
గేదెలను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారులో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రెండు గేదెలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గేదెలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు గేదెలు లేవలేని స్థితిలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.
● ముగ్గురు జిల్లావాసులు మృతి
● పాలాజ్ గణేశ్ మందిరానికి వెళ్లి వస్తుండగా ఘటన
వర్ని: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం హుమ్నాపూర్, బోధన్ మండలం బె ల్లాల్కు చెందిన బంధువులు ఐదుగురు బుధవారం ఉదయం కారులో మహారాష్ట్రలోని పా లాజ్ గణేశ్ మందిరానికి వెళ్లారు. దర్శనం అనంతరం రాత్రి తిరిగి వస్తుండగా నాందేడ్ జిల్లా బోకర్ తాలూక ప్రాంతంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కా రు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న చేకూరి బుల్లి రాజు(50), అతని భార్య సునీత (45), వాణి (38) అక్కడికక్కడే మృతి చెందగా, గున్నం చంద్రశేఖర్ (35), నీలిమా(45)కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్, భైంసా ఆస్పత్రులకు తరలించారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్