జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ

Jul 22 2025 7:59 AM | Updated on Jul 22 2025 8:23 AM

జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని అర్‌అండ్‌బీ అతిథి గృహంలో జాతీయ ఓబీసీ మహాసభల వాల్‌ పోస్టర్లను సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివరాములు మాట్లాడుతూ.. ఆగష్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 10 వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారన్నారని తెలిపారు. ఈ మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. నేతలు నాగరాజు, భూమన్న, మోహనాచారి, నాగోజి నారాయణరావు, హాజీ అబ్దుల్‌ అజీజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement