
ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖ లు తమకు కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్ర భుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక అవసరంపై సంబంధిత అధికారులతో సమావే శం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఇసుక అవసరముంది, జిల్లాలో ఎంత ఇ సుక అందుబాటులో ఉంది అన్న వివరాలు తె లుసుకున్నారు. ఇసుక కోసం పోర్టల్లో నమో దు చేసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా రవాణాకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి క్టర్, గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నగేశ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న
కలెక్టర్ అశిష్ సంగ్వాన్