ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Jul 1 2025 4:01 AM | Updated on Jul 1 2025 4:01 AM

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 141 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత సమస్యలు, ఇబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్‌ల మంజూరులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో తీసుకున్న చర్యల సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియపరచాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, చందర్‌, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement