
పసుపు రాజధాని
నిజామాబాద్ ఇక
ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి
బీజేపీకి అధికారం ఇవ్వండి
రాష్ట్రంలో అందరికీ అవకాశం ఇచ్చారు.. బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా ప్రజలు గొప్ప వారు.. కొట్లాడి పసుపు బోర్డును సాధించుకున్నారు. ఇందూరు రైతుల పోరాటం మామూలుది కాదు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ధర్మపురి అర్వింద్ కాస్త పసుపు అర్వింద్ అయ్యారు. రైతును రాజు చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కారు నినాదం. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన అమిత్ షాకు అందరం నిల్చొని చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నాం. (సభాప్రాంగణంలోని వారంతా నిల్చుని చప్పట్లు కొట్టారు.)
– బండి సంజయ్, కేంద్ర సహాయమంత్రి
● పంటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
● పసుపు బోర్డు కార్యాలయాన్ని
ప్రారంభించడం నా అదృష్టం
● రైతులకు ఇచ్చిన హామీని
మోదీ నెరవేర్చారు
● జిల్లాలో రీసెర్చ్ సెంటర్లు..
● ఆర్గానిక్ పసుపు ఉత్పత్తి,
మార్కెటింగ్కు ప్రభుత్వ కృషి
● రైతు సమ్మేళనంలో
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
సుభాష్నగర్: నిజామాబాద్ పసుపు రాజధానిగా కాబోతోందని, ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే పసుపు ఎగుమతి అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రైతు సమ్మేళనం బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.
రైతు సమ్మేళనంలో షా ప్రసంగం సాగిందిలా..
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. ఇందూరు రైతుల పోరాటం, ఎంపీ అర్వింద్ రైతులకు ఇచ్చిన హామీమేరకు మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. బోర్డు ఏర్పాటుతో రాబోయే రెండుమూడేళ్లలో ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఏళ్లుగా రైతులు పసుపు సాగు చేస్తున్నా.. మార్కెట్లో అనుకున్న ధర, గుర్తింపు రాలేదని.. ఇక నుంచి ధర పెరుగుతూనే ఉంటుందన్నారు.
జిల్లాలో పసుపు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, బోర్డు ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ బ్రాంచ్ను, భారత్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితోపాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది క్వింటాల్ పసుపు ధర రూ.19వే లు పలికిందని.. రానున్న మూడేళ్లలో రూ.7వేలు అదనం అవుతుందని పేర్కొన్నారు. రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చేసి ఇక్కడి ప్రజలకు గుర్తింపు ఇచ్చామని అన్నారు. సభలో ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.
రైతు పక్షపాతి కేంద్ర ప్రభుత్వం
పసుపు బోర్డు కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నా రు. రైతు ఉద్యమాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డును ప్రకటించి వారి కలను సా కారం చేసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పసుపు సాగవు తున్నా.. ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ప్ర ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిజామా బాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏ ర్పాటు చేశారు. కేంద్రంరై తు పక్షపాతి. గతంలో వి ద్యుత్ కోతలతో పంటలు ఎండు ముఖం పట్టేవి. ప దేళ్ల బీజేపీ పాలనలో వి ద్యుత్ కోతలు లేని భారత్ ను నిర్మించాం. సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ డబ్బులు ఇస్తు న్నారు. అయినా రైతాంగానికి మోదీ ఏం చేస్తున్నారని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీ ఆర్ ఇలాగే ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు.
– కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

పసుపు రాజధాని

పసుపు రాజధాని

పసుపు రాజధాని

పసుపు రాజధాని

పసుపు రాజధాని

పసుపు రాజధాని