
ముందుకు సాగని ఫార్మర్ రిజిస్ట్రీ
● అవగాహన లోపంతో
ముందుకురాని రైతులు
● ఆపై సాంకేతిక సమస్యలు..
● జిల్లాలో ఇప్పటి వరకు
35 శాతమే నమోదు
త్వరలో పూర్తి చేస్తాం..
జిల్లాలోని అన్ని మండలాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ న మోదు జరుగుతోంది. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. త్వ రలోనే ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తాం. రైతులు స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను నేరుగా సంప్రదించి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – తిరుమల ప్రసాద్, డీఏవో
కామారెడ్డి క్రైం : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. రెండునెలలు కావస్తున్నా జిల్లాలో 35 శాతం మాత్రమే నమోదు పూర్తయ్యింది.
రైతుల గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మ ర్ రిజిస్ట్రీని తీసుకువచ్చింది. గతనెల 5వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రైతు నుంచి వివ రాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం ద్వా రా ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 నంబర్లతో కూడిన ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేస్తారు. జి ల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. 23 మండలాల పరిధిలో 104 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఒక ఏఈవో ఉన్నారు. మే 5 న జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు ల పంట పొలాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, భూమి విస్తీర్ణం, భూమి రకం, పండిస్తున్న పంటలు, ఆధార్ నంబర్తో లింక్ అయిన రై తు మొబైల్ నంబరు తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
ఆ తర్వాత రైతుకు 11 నంబర్లు గల డిజిటల్ ఫార్మర్ ఐడీ జారీ అవుతుంది. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ కీలకం కానుందని భావిస్తున్నారు. అ యితే ఫార్మర్ రిజిస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
పని ఒత్తిడిలో అధికారులు
రైతు భరోసా, పంటల నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర పనుల్లో ఇప్పటికే వ్యవసాయ అధికారులు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో క్షేత్ర స్ధాయిలో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయాల్సి రావడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లిన సమయాల్లో నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్ మొరాయించడం లాంటివి జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పలువురు రైతుల వద్ద ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతున్నారు. రైతులు నేరుగా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించి తమ వివరాలు ఇవ్వడం ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ముందుకు సాగని ఫార్మర్ రిజిస్ట్రీ