ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

Jun 30 2025 7:38 AM | Updated on Jun 30 2025 7:38 AM

ముగిస

ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న పాలిసెట్‌ తొలిదశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఈ విషయాన్ని పాలిసెట్‌ జిల్లా సమన్వయకర్త, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మూడు రోజుల్లో 416 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించామని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఒకటో తేదీలోగా వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. నాలుగో తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో అజారుద్దీన్‌, ఫర్హీన్‌ ఫాతిమా, శ్రీలత, అఫ్రీన్‌ ఫాతిమా, పవన్‌కుమార్‌, నాగరాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ

కాంగ్రెస్‌ ఇన్‌చార్జీగా ఐకే రెడ్డి

భిక్కనూరు: కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, రామేశ్వర్‌పల్లికి చెందిన బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఆధిష్టానం ఆదివారం నియామకపు ఉత్తర్వులను జారీచేసింది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

3న గురు పూజోత్సవం

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని సత్య కన్వెన్షన్‌లో మూడో తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహ కొత్తోల్ల శివరాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా సంఘ్‌ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌ పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.

మొలకలతో కళకళ

మద్నూర్‌: మండలంలో ముందస్తుగా కురిసిన వర్షాలతో ఆయా పంటల విత్తనాలు వేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో మొలకలు వస్తున్నాయి. దీంతో భూమి పచ్చగా కళకళలాడుతోంది. ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో సోయాబీన్‌, పత్తి, కంది, పెసర, మినుము పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు పేర్కొంటున్నారు.

బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం

దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం సంద ర్భంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ చైర్మన్‌ సిద్దారెడ్డి తెలిపారు. ఆలయంలో ఆదివారం గ్రామస్తులతో ఆయన సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఏటా నిర్వహించినట్లుగానే ఈసారి కూడా వైభవంగా బోనాల జాతర నిర్వహించాలని తీర్మానించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ, వ్యాపార సంబంధిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రభు, ఆలయ ప్రధాన అర్చకులు శరత్‌ శర్మ, ధర్మకర్తలు ఎల్లం, రమేష్‌, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన తొలివిడత పాలిసెట్‌  సర్టిఫికెట్ల పరిశీలన 
1
1/3

ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ముగిసిన తొలివిడత పాలిసెట్‌  సర్టిఫికెట్ల పరిశీలన 
2
2/3

ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ముగిసిన తొలివిడత పాలిసెట్‌  సర్టిఫికెట్ల పరిశీలన 
3
3/3

ముగిసిన తొలివిడత పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement