
డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్షా
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ రూ.44 లక్షల వ్యయంతో 14 అడుగుల డీఎస్ కాంస్య వి గ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్తోపాటు కుటుంబ సభ్యులు, రాజ్య సభ్యుడు లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రతినిధుల నివాళులు
డీఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నుడా చై ర్మన్ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీఎస్ సోదరుడు ధర్మపురి సురేందర్, మా జీ జెడ్పీటీసీ పుప్పాల శోభ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. డీఎస్ అభిమానులు, నాయకులు విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకున్నారు.