
పసుపు బోర్డు కేంద్రం ఇచ్చిన బహుమతి
సుభాష్నగర్ : పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి గురువా రం ఆయన వీక్షించారు. అనంతరం విలేకరులతో కిషన్రెడ్డి మాట్లాడారు. పసుపు బోర్డు కావాలనే 40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం ప్రకటించిందని, ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయపార్టీ నిర్ణయం, ప్రధాని మో దీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పడిందన్నారు. పసుపు బోర్డు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలు అడిగాయని, మోదీ చివరకు నిజామాబాద్లోనే ఏ ర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన రైతుబిడ్డనే నియమించారన్నారు. ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం పూర్తిస్థా యిలో కార్యరూపం దాల్చనుందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు సమ్మేళనానికి హా జరై విజయవంతం చేయాలని కోరారు. పసుపు బో ర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బోర్డు లోగో ను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపా రు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కూడా షా ఆవిష్కరిస్తారని తెలిపారు.
రైతు సమ్మేళనానికి తరలిరావాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన బహిరంగ సభకు హాజరవుతారని, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పిలుపు నిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి, బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి
ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిని
కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది
నిజామాబాద్ జిల్లా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువు
అమిత్ షా సభను జయప్రదం చేయాలని పిలుపు