
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ రహదారిపై కారు బోల్తా పడటంతో డ్రైవర్తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం కారులో సాటాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం అదే రాత్రి తిరిగి నగరానికి బయలుదేరారు. సాటాపూర్ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ సర్పరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.