ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించే నాయకత్వం ఉండేది. అన్ని నియోజక వర్గాల నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా జిల్లాను లీడ్‌ చేసే నాయకులు కనిపించడం లేదు. ప్రధాన నేతలందరూ తమ | - | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించే నాయకత్వం ఉండేది. అన్ని నియోజక వర్గాల నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా జిల్లాను లీడ్‌ చేసే నాయకులు కనిపించడం లేదు. ప్రధాన నేతలందరూ తమ

Jun 11 2025 9:06 AM | Updated on Jun 11 2025 9:06 AM

ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉమ్మడి జిల్లా రాజకీయ

ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉమ్మడి జిల్లా రాజకీయ

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రె స్‌ జిల్లా అధ్యక్షుడిగా కై లాస్‌ శ్రీనివాస్‌రావు, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ముజీబుద్దీన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు ఉన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు పార్టీ కార్యక్రమా లు ఉన్నపుడు అటెండ్‌ అవుతారు తప్ప అందరినీ స మన్వయం చేసే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్‌ జిల్లా అ ధ్యక్షుడు ముజీబొద్దీన్‌ పార్టీ అధికారంలో ఉన్న స మయంలో కొంత యాక్టివ్‌గానే ఉన్నా, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేశారు. ఈ మధ్య కా లంలో ఆయన కూడా రాజకీయాల్లో చురుకుగా పా ల్గొనడం లేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా అందరినీ సమన్వయం చేయడంలో చురుకై న పాత్ర పో షించలేకపోతున్నారన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌లో ఎక్కడి వారక్కడే..

కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో షబ్బీర్‌అలీ అన్నీ తానై జిల్లాను నడిపించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కామారెడ్డితో పాటు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారు. బాన్సువాడకు చెందిన సీనియర్‌ నేత, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొన్నటి ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, తరువాత కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించారు. తరువాత 2014 లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉమ్మడి జిల్లాను లీడ్‌ చేశారు. 2018లో రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్‌ పదవిలో ఉన్నారు. ఈసారి పార్టీ మారిన తర్వాత తన నియోజక వర్గానికే పరిమితమయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తన నియోజక వర్గంలో అన్నీ తానే చూసుకుంటారు. తన నియోజకవర్గంలో మరొకరి పెత్తనం ఉండకూడదనే భావనతో ఉన్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం 22వ ప్యాకేజీకి ఇటీవల రూ. 23 కోట్లు మంజూరయ్యాయి. అయితే రెండు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు నిధులు తాను తెచ్చానంటే తానే తెచ్చానని చెప్పుకున్నారు. పనులు పూర్తి చేయడానికి నేతలు సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు తీసుకువచ్చే పరిస్థితి కనబడడం లేదు.

బీజేపీలోనూ అంతే..

అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ అభ్య ర్థి గెలుపొందడం, మిగతా మూడు నియోజకవర్గాల్లో మంచి ఓట్లు రావడంతో ఆ పార్టీ శ్రే ణుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే పార్టీ జి ల్లా శాఖను లీడ్‌ చేసే నాయకత్వం కనిపించ డం లేదు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఎల్లారెడ్డిలో పార్టీ మాజీ జిల్లా అ ధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పార్టీ వ్యవహారా లను చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్టు ఆశించిన సైంటిస్ట్‌ పైడి ఎల్లారెడ్డి ఈ మధ్య కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే అరుణతార పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. అయితే అంతా ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితమవడం, వీరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే నేత లేకపోవడంతో పార్టీ శ్రేణులలో జోష్‌ కనిపించడం లేదు.

అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య

అధికార పార్టీలో నేతల మధ్య

సమన్వయం కరువు

బీఆర్‌ఎస్‌, బీజేపీలదీ అదే పరిస్థితి

బీఆర్‌ఎస్‌దీ అదే పరిస్థితి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాపై పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఓటమి తరువాత నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటోంది. తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్ల పాటు నేతలను సమన్వయం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నియోజక వర్గంపైనే ఎక్కువగా ఫోకస్‌ చేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి లీడ్‌ చేశారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ఆయన సమన్వయం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసే లీడర్‌ లేకుండాపోయారు. కామారెడ్డిలో మాజీ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్‌, జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధేలు తమ తమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. బాన్సువాడలో నాయకత్వ సమస్య ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement