
వివాహేతర సంబంధమే కారణం
కామారెడ్డి క్రైం: ఇటీవల హత్యకు గురైన చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి దరావత్ కృష్ణ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. ఈమేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. పిట్లం మండలం రూమ్ తండాకు చెందిన దరావత్ కృష్ణ (28) చిన్న కొడప్గల్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండేవాడు. చిన్నకొడప్గల్కు చెందిన లింగంపేట మల్కయ్య అలియాస్ మల్కన్న ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడు. తన భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడిందని గుర్తించాడు. ఈ విషయంలో భార్యతో తరచుగా గొడవపడేవాడు.చివరికి తమ సంసారం చక్కబెట్టుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించుకొని, కృష్ణను చంపాలనుకున్నారు. ఇందుకోసం తమ కులస్తులైన ఏరనోళ్ల బాల్రాజ్, మల్కయ్యల సహాయం తీసుకున్నారు. ఈనెల 5న సుజాత ద్వారా కృష్ణను ఇంటికి పిలిపించుకుని నలుగురూ కలిసి కత్తి, గొడ్డలి ఇనుపరాడ్డులతో కొట్టి చంపారు. ఆపై మృతదేహాన్ని, కృష్ణ బైక్ను సమీపంలోని రెడ్డి చెరువులో పడవేశారు. 7న గాయాలతో కూడిన కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు. హత్య కేసును చేధించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, రూరల్ సీఐ రాజేష్, పిట్లం ఎస్సై రాజును ఆయన అభినందించారు.
చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి
హత్య కేసును ఛేదించిన పోలీసులు
నలుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర

వివాహేతర సంబంధమే కారణం