కబ్జా నుంచి చెరువును కాపాడండి | - | Sakshi
Sakshi News home page

కబ్జా నుంచి చెరువును కాపాడండి

Jun 13 2025 7:23 AM | Updated on Jun 13 2025 7:23 AM

కబ్జా నుంచి చెరువును కాపాడండి

కబ్జా నుంచి చెరువును కాపాడండి

గాంధారి(ఎల్లారెడ్డి): కబ్జాకు గురవుతున్న నాగ్లూర్‌ చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు వారు గురువారం మండలంలో పర్యటించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు సమస్యను విన్నవించారు. చెరువు నుంచి నల్లమట్టిని అక్రమంగా తరలిస్తూ చెరువును కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు మండల పరిధిలోని కారోబార్లు, పారిశుధ్య కార్మికులు పెండింగ్‌ వేతనాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వేతనాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కారోబార్లు పండరి, శ్రావణ్‌, మనసారామ్‌, సాయిలు, అనిల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement