● అయితే హత్యలు.. లేకపోతే ఆత్మహత్యలు ● చిన్నపాటి గొడవలకే కఠిన నిర్ణయాలు | - | Sakshi
Sakshi News home page

● అయితే హత్యలు.. లేకపోతే ఆత్మహత్యలు ● చిన్నపాటి గొడవలకే కఠిన నిర్ణయాలు

Jun 14 2025 7:39 AM | Updated on Jun 14 2025 7:39 AM

● అయితే హత్యలు.. లేకపోతే ఆత్మహత్యలు ● చిన్నపాటి గొడవలకే

● అయితే హత్యలు.. లేకపోతే ఆత్మహత్యలు ● చిన్నపాటి గొడవలకే

● కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన స్రవంతి (25), తన కొడుకు రుద్రేశ్వర్‌ (4) తో కలిసి ఈనెల 6న చిన్నమల్లారెడ్డి చెరు వులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలో గొడవలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

● లింగంపేట మండలం పోల్కంపేటలో భార్య తో జరిగిన గొడవ కొడుకు హత్యకు దారితీసింది. పిల్లలు ఆడుకుంటూ తోసుకున్న విషయమై అనిల్‌కు అతడి భార్యకు గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యను కొట్టిన అనిల్‌.. తర్వాత నాలుగేళ్ల కొడుకు శశాంక్‌ను బయటకు తీసుకువెళ్లి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంటింటికీ మంటిపొ య్యే అన్నట్లుగా కలహాలు లేని కాపురాలు ఉండవు. ప్రతి ఇంట్లో పొరపొచ్చాలు సహజం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఓర్పుతో కూర్చుని మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. తెగేదాకా లాగితేనే ఇ బ్బంది.. గొడవలు జరిగినప్పుడు, వివాదాలు తలెత్తినప్పుడు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో విలువైన ప్రాణాలు పోతున్నాయి. కొందరు ఆవేశంలో ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కుటుంబా ల్లో తలెత్తే చిన్నపాటి గొడవలతో ఆవేశాలకు లోన వుతుండడంతో సమస్యలు పెరుగుతున్నాయి.

వివాహేతర సంబంధాలతో..

చాలా సంఘటనల్లో వివాహేతర సంబంధాల వల్లే హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అన్యోన్యంగా ఉన్న జంట మధ్య అనుమానాలు తలెత్తి అ వి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తన భర్త పరాయి సీ్త్రతో తిరుగుతున్నాడని తెలిసిననుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలై అవి చినికిచినికి గాలివానగా మారి హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. భార్య లేదా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నపుడు ప్రియుడు/ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్త/భార్యను హతమారుస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి.

మద్యం, వ్యసనాలు కూడా కారణమే...

కుటుంబాల్లో వివాదాలు, విభేదాలకు మద్యంతో పాటు జూదం, బెట్టింగులు కూడా కారణమవుతున్నాయి. తాగుడు, ఇతర వ్యసనాలకు అలవాటు పడిన కొడుకును తల్లిదండ్రులు మందలించినా, భర్తను భార్య మందలించినా తాగిన మత్తులో కన్నవారిని, కట్టుకున్న భార్యను చంపడానికి వెనుకాడడం లేదు. కొన్ని సందర్భాల్లో తాగి ఇబ్బంది పెడుతున్న కొడుకు/భర్తను భరించలేని కుటుంబ సభ్యులు ఆవేశంలో చంపేస్తున్నారు. మద్యంతో పాటు ఇతర వ్యసనాలు కాపురాలను కకావికలం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో జిల్లాలో చోటు చేసుకున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు, హత్యలు సాధారణంగా మారాయి. ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. చిన్నచిన్న కారణాలతో హత్యలు చేస్తున్నారు. లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

పిట్లం మండలం రూంతండాకు చెందిన ద రావత్‌ కృష్ణ (28) చిన్నకొడప్‌గల్‌ గ్రామ పంచా యతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో సద రు మహిళకు ఆమె భర్తకు గొడవలు జరిగాయి. చివరకు వారిద్దరు కలిసి దరావత్‌ కృష్ణను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మరో ఇద్దరి సహకారంతో కృష్ణను కత్తితో పొడిచి చంపి చెరువులో పడేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement