
ఫోన్ చేస్తే బస్సు వేళలు.. చార్జీల వివరాలు
ఖలీల్వాడి: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం సంస్థ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ఆయా ప్రాంతాలకు బస్సులు బయలుదేరు సమయం వివరాల తెలుసుకునేందుకు బస్టాండ్లకు వెళ్లే అవసరం లేకుండా ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ నంబర్లకు ఫోన్ చేసి బస్సుల వేళలు, చార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్ఎం జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.