
జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు..
నాగిరెడ్డిపేట: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో దా దాపు సగం నిధులను మంజూరు చేసింది. ఈ పనులను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూ ర్తి చేయాల్సింది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమైనా పనుల జాడ మాత్రం కనిపించడం లేదు.
జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా వి ద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3.41 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలలవారీగా నిధులను కేటాయిస్తూ మొత్తం రూ. 1.64 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో కేజీబీవీల్లో అదనపు వసతి గృహాలు, అదనపు టాయ్లెట్లు, స్నానపు గదులు, అదనపు కిచెన్ షెడ్లు, క్రీడా కోర్టులు, సెప్టిక్ట్యాంకులు, డ్రెయినేజీ అవుట్లెట్లు, డ్రెయినేజీ పైపులైన్ల నిర్మాణం, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఇదివరకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల మరమ్మతులు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటితోపాటు గతంలో అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను సైతం పూర్తి చేయాలి. ఆయా పనులకు అనుమతులు లభించకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
నాలుగు పాఠశాలలకు అధిక నిధులు
జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా.. నాలుగింటికి మా త్రం అధిక నిధులు కేటాయించారు. నాగిరెడ్డిపేట, రామారెడ్డి, తాడ్వాయి, మాచారెడ్డిలలోని భవనా లను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. దీంతో వాటి మరమ్మతులతోపాటు అదనపు గదుల నిర్మాణం కోసం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిధుల కేటాయింపులో ఆలస్యంతోనే..
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మరమ్మతులకు నిధుల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఏప్రిల్ 24న వేసవి సెలవులు ఇచ్చారు. అప్పటికే నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టి ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం గతనెల 15న నిధులు కేటాయించింది. ఇప్పటికీ పనుల అంచనాలకు అనుమతులు రాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. అధికారులు త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అంచనాలు రూపొందించాం
జిల్లాలోని కేజీబీవీల్లో చేపట్టాల్సిన మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆయా పనులకు సంబంధించి ఇప్పటికే అంచనాలు రూ పొందించి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
– సుబ్బారాయుడు, ఏఈ,
టీజీఈడబ్ల్యూఐడీసీ, కామారెడ్డి
పాఠశాల కేటాయించిన మంజూరైన
నిధులు నిధులు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
గాంధారి 5 2.410
బాన్సువాడ 5 2.410
జుక్కల్ 8 3.856
ఎల్లారెడ్డి 8 3.856
పిట్లం 8 3.856
బీబీపేట 8 3.856
బిచ్కుంద 8 3.856
దోమకొండ 8 3.856
కామారెడ్డి 8 3.856
రాజంపేట 11 5.302
మద్నూర్ 11 5.302
భిక్కనూరు 11 5.302
లింగంపేట 16 7.712
బీర్కూర్ 16 7.712
నిజాంసాగర్ 21 10.122
మాచారెడ్డి 45 21.690
రామారెడ్డి 48 23.136
తాడ్వాయి 48 23.136
నాగిరెడ్డిపేట 48 23.136
మొత్తం 341 164.632
కేజీబీవీల్లో మరమ్మతులకు
నిధుల కేటాయింపు
19 విద్యాలయాలకు రూ. 3.41 కోట్లు
మొదటి విడతలో
రూ. 1.64 కోట్లు మంజూరు
పాఠశాలలు పునఃప్రారంభమైనా మొదలుకాని పనులు