జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు..

Jun 14 2025 7:39 AM | Updated on Jun 14 2025 7:39 AM

జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు..

జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు..

నాగిరెడ్డిపేట: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో దా దాపు సగం నిధులను మంజూరు చేసింది. ఈ పనులను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూ ర్తి చేయాల్సింది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమైనా పనుల జాడ మాత్రం కనిపించడం లేదు.

జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా వి ద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3.41 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలలవారీగా నిధులను కేటాయిస్తూ మొత్తం రూ. 1.64 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో కేజీబీవీల్లో అదనపు వసతి గృహాలు, అదనపు టాయ్‌లెట్లు, స్నానపు గదులు, అదనపు కిచెన్‌ షెడ్లు, క్రీడా కోర్టులు, సెప్టిక్‌ట్యాంకులు, డ్రెయినేజీ అవుట్‌లెట్లు, డ్రెయినేజీ పైపులైన్ల నిర్మాణం, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఇదివరకు ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ల మరమ్మతులు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు, విద్యుత్‌ వైరింగ్‌ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటితోపాటు గతంలో అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను సైతం పూర్తి చేయాలి. ఆయా పనులకు అనుమతులు లభించకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.

నాలుగు పాఠశాలలకు అధిక నిధులు

జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా.. నాలుగింటికి మా త్రం అధిక నిధులు కేటాయించారు. నాగిరెడ్డిపేట, రామారెడ్డి, తాడ్వాయి, మాచారెడ్డిలలోని భవనా లను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. దీంతో వాటి మరమ్మతులతోపాటు అదనపు గదుల నిర్మాణం కోసం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిధుల కేటాయింపులో ఆలస్యంతోనే..

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మరమ్మతులకు నిధుల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఏప్రిల్‌ 24న వేసవి సెలవులు ఇచ్చారు. అప్పటికే నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టి ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం గతనెల 15న నిధులు కేటాయించింది. ఇప్పటికీ పనుల అంచనాలకు అనుమతులు రాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. అధికారులు త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

అంచనాలు రూపొందించాం

జిల్లాలోని కేజీబీవీల్లో చేపట్టాల్సిన మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆయా పనులకు సంబంధించి ఇప్పటికే అంచనాలు రూ పొందించి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

– సుబ్బారాయుడు, ఏఈ,

టీజీఈడబ్ల్యూఐడీసీ, కామారెడ్డి

పాఠశాల కేటాయించిన మంజూరైన

నిధులు నిధులు

(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)

గాంధారి 5 2.410

బాన్సువాడ 5 2.410

జుక్కల్‌ 8 3.856

ఎల్లారెడ్డి 8 3.856

పిట్లం 8 3.856

బీబీపేట 8 3.856

బిచ్కుంద 8 3.856

దోమకొండ 8 3.856

కామారెడ్డి 8 3.856

రాజంపేట 11 5.302

మద్నూర్‌ 11 5.302

భిక్కనూరు 11 5.302

లింగంపేట 16 7.712

బీర్కూర్‌ 16 7.712

నిజాంసాగర్‌ 21 10.122

మాచారెడ్డి 45 21.690

రామారెడ్డి 48 23.136

తాడ్వాయి 48 23.136

నాగిరెడ్డిపేట 48 23.136

మొత్తం 341 164.632

కేజీబీవీల్లో మరమ్మతులకు

నిధుల కేటాయింపు

19 విద్యాలయాలకు రూ. 3.41 కోట్లు

మొదటి విడతలో

రూ. 1.64 కోట్లు మంజూరు

పాఠశాలలు పునఃప్రారంభమైనా మొదలుకాని పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement