అమ్మకు అక్షరాభ్యాసం
ఫోన్నంబర్లు..
కామారెడ్డి టౌన్ : జిల్లాలో వంద శాతం మహిళ లను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో వి ద్యాశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో ని స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యు లైన మహిళలను అక్షరాస్యులుగా చేయనున్నారు.
జిల్లాలోని 25 మండలాల్లో 17,194 స్వ యం సహాయక సంఘాలున్నాయి. వాటిలో 42,749 మంది సభ్యులు నిరక్షరాస్యులని గు ర్తించారు. వీరందరిని అక్షరాస్యులుగా చేసే దిశ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ఆదే శాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధా రి మండలం పొతంగల్ ఖుర్దులో డీఈవో రాజు ప్రారంభించారు. గ్రామంలో వేదపండితుడితో అక్షరాభ్యాసం పూజ చేయించి పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించారు.
తోటి సభ్యులతో
చదువు చెప్పించే ప్రణాళిక..
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు అదే గ్రూపులోని అక్షరాస్యులైన మహిళలతో చదువు చెప్పించనున్నారు. వయోజన విద్యా విభాగం ప్రత్యేక కార్యక్రమాలతో వారు అక్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసేలా, ఇంగ్లిష్ చదివేలా చేయాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి బడిబాటలో భాగంగా నిర్వహిస్తున్న సామూహిక అక్షరాభ్యాసాలతో పాటు వయోజన విద్య విభాగానికి సంబంధించిన ’అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులు పెర్కొన్నారు.
ఆర్మూర్ 73828 43133
బోధన్ 98495 00725
నిజామాబాద్ 99592 26022
బాన్సువాడ 94911 05706
కామారెడ్డి 73828 43747
వందశాతం అక్షరాస్యత
జిల్లాగా మార్చాలన్న లక్ష్యంతో..
జిల్లాలో 42,749 మందిని
అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం
రాష్ట్రంలోనే మొదటిసారిగా
జిల్లాలో వినూత్న ప్రయోగం
పొతంగల్ ఖుర్దులో
ప్రారంభించిన డీఈవో
వంద శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమం ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలలో వయసుతో సంబంధం లేకుండా నిరక్షరాస్యులైన వారిని గుర్తించాం. వారందరికీ ఈ కార్యక్రమంలో చదు వు నేర్పుతాం. తెలుగు పదాలు, ఇంగ్లిష్ అ క్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసే లా చూడాలన్నది కార్యక్రమ ఉద్దేశం. ఇ లాంటి కార్యక్రమం చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి. – రాజు, డీఈవో, కామారెడ్డి
నిధులున్నా.. పనుల జాడేది?