నిబంధనలు పట్టవు.. తీరు మారదు.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పట్టవు.. తీరు మారదు..

Jun 13 2025 7:23 AM | Updated on Jun 13 2025 7:23 AM

నిబంధ

నిబంధనలు పట్టవు.. తీరు మారదు..

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి డివిజన్‌ల పరిధిలో పలు ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కొందరు గల్లీలో, అపార్ట్‌మెంట్‌లలో, గృహాల్లో బడులను నెలకొల్పుతూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారు. అనుమతులు రాకముందే కొన్ని ప్రారంభిస్తున్నారు. విద్యాశాఖ సమయసారిణి విస్మరిస్తూ తరగతులు కొనసాగిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. అయినా అధికారులు అటువైపు చూడకపోవడం, తనిఖీలు చేయకపోవడంపై అనుమానాలు తలెత్తున్నాయి.

కనిపించని కనీస ప్రమాణాలు

పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్ప నిసరి. ఏ పేరుతో అనుమతి తీసుకుంటారో దానినే బోర్డు, కరపత్రాలపై ముద్రించాలి. టెక్నో, ఈ టె క్నో, ప్రైమ్‌, టాలెంట్‌ లాంటి తోక పేర్లను జోడించవద్దని నిబంధనలు ఉన్నా జోడించి మరి ప్రచారం చేయడంతోపాటు బోర్డులపై ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు వచ్చేలా విశాలమైన తరగతి గదు లు, పిల్లలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, క్రీడ ల కోసం మైదానాలు, అగ్నిమాపక శాఖ అనుమతి, అగ్నిమాపక పరికరాలు, తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ కొన్ని స్కూల్స్‌లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఇరుకై న గదులు, దుకాణ, ఇళ్ల సముదాయాలు వంటి వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. మైదానాలు వేరే చోటు లీజుకు తీసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా ప్రైవేట్‌ స్కూళ్లు సుమారు 200కు పైగా ఉండగా, అ నధికారికంగా మరో 40కిపైగా ఉంటాయి. తాజాగా జిల్లా కేంద్రంలోనే 7 పాఠశాలలకు అనుమతులు లేవని తల్లిదండ్రులు గమనించాలని డీఈవోనే ప్రకటన విడుదల చేశారు. గుర్తింపులేని బడుల్లో చదవితే ధ్రువపత్రాలు లభించక విద్యార్థులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడే పరిస్థితులుంటాయి.

జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల

ఇష్టారాజ్యం

అధిక ఫీజు వసూళ్లు

అపార్ట్‌మెంట్‌లు, నివాస గృహాల్లో స్కూల్‌ల నిర్వహణ

జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఓ కార్పొరేట్‌ స్కూల్‌ అపార్ట్‌మెంట్‌లో కొనసాగుతుంది. పార్కింగ్‌ స్థలం, క్రీడా మైదానం అసలే లేదు. ఇరుకు గదుల్లో వందల సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెడుతారు.

విద్యానగర్‌ కాలనీలోగల అపార్ట్‌మెంట్‌లో ఒకటి, బహుళ అంతస్తు భవనంలో మరొకటి నిబంధనలకు విరుద్దంగా స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, ఫైర్‌ సెఫ్టీ లేకుండా, మైదానం, పార్కింగ్‌ స్థలం కనీస ప్రమాణాలు పాటించకుండా స్కూల్స్‌ కొనసాగిస్తున్నారు.

గోదాం రోడ్‌లో ప్రభుత్వ గోదాంల పక్కన నాలుగు అంతస్తుల ఇరుకు భవనంలో ఓ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగితే కనీసం బైక్‌ వెళ్లడానికి వీలులేకుండా సెట్‌బ్యాక్‌ కూడా లేదు. పార్కింగ్‌, మైదానానికి గజం స్థలం కూడా లేదు.

గాంధీనగర్‌, దేశాయిబ్రదర్స్‌ వెనకాల, పెద్దబజార్‌, ఎన్జీవోస్‌ కాలనీ, అశోక్‌నగర్‌ కాలనీ, కలెక్టరేట్‌కు కూత వేటు దూరం భవానీనగర్‌లో గృహ నిర్మాణ భవనాల్లో నిబంధనలకు విరుద్దంగా కనీస ప్రమాణాలు పాటించకుండా స్కూళ్లు కొనసాగుతున్నాయి.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధన లను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు మౌలిక స దుపాయాలు కల్పించాలి. క్రీ డామైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దు. స్కూల్‌లో బుక్స్‌, యూనిఫాం తదితర సామగ్రి విక్రయా లు చేస్తే సీజ్‌ చేస్తాం. తల్లిదండ్రుల నుంచి ఫిర్యా దులు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. –ఎస్‌.రాజు, డీఈవో, కామారెడ్డి

ప్రత్యేక కోర్సుల పేరిట ఫీజులు

జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇ ష్టారితీన ఫీజులు వసూళ్లు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. కేవలం నర్సరీ, ఒకటోతరగతి పిల్లల కే ఏడాదికి రూ. 50వేలకు పైగా వసూళ్లు చేస్తున్నా రు. అడ్మిషన్‌, ట్యూషన్‌, కంప్యూటర్‌, ఐఐటీ, అబాకస్‌ తదితర కోర్సుల పేరిట అధనంగా దండుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీ ఊసే లేదు. యూనిఫాం, ప్రత్యేకంగా ఒక రోజు మరో జత, రెండు రకాల బూట్లు, బెల్టు, టై, నోట్‌, పాఠ్య పుస్తకాలు తమకు అనుసంధానంగా ఉన్న స్టాల్‌లోనే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేపడితే పిల్లలకు, తల్లిదండ్రులకు మేలుజరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు పట్టవు.. తీరు మారదు.. 1
1/2

నిబంధనలు పట్టవు.. తీరు మారదు..

నిబంధనలు పట్టవు.. తీరు మారదు.. 2
2/2

నిబంధనలు పట్టవు.. తీరు మారదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement