
అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి
బాన్సువాడ : పట్టణంలోని వాసవీకాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న గోజే రాఘవేందర్ (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం మద్దెల్చెర్వు గ్రామానికి చెందిన రాఘవేందర్ మూడేళ్లుగా ఓ స్టీల్ దుకాణంలో పనిచేస్తూ బా న్సువాడలో నివాసముంటున్నాడు. గుంటూరుకు చెందిన అంబికను ప్రేమించి పెద్దల అంగీకరంతో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. ఈ నెల 9న అంబిక తన బంధువుల ప్రథమ దినకర్మకు గుంటూరుకు వెళ్లింది. పిల్లలను మద్దెల్చెర్వులో ఉండే బావ రాజేందర్ ఇంట్లో ఉంచింది. రెండు రోజులుగా భర్త రాఘవేందర్కు ఫోన్ చేసినా కలవకపోవడంతో రాజేందర్కు స మాచారం ఇచ్చింది. దీంతో రాజేందర్ తల్లిని బాన్సువాడ లోని తమ్ముడి ఇంటికి పంప గా, లోపలి నుంచి తాళాలు వేసి ఉన్న విషయం తెలిపింది. రాజేందర్ డయల్ 100కు సమాచారం ఇవ్వ గా, పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టడంతో రాఘవేందర్ శవమై కనిపించాడు. కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.