
మహిళల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: మహిళల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి జిల్లా మాతా శిశు ఆరోగ్య అధికారిణి అనురాధ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పీహెచ్సీలో గురువారం ఆమె జిల్లా పార్మసిస్టులతో ఎనీమియా ముక్త్ భారత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనురాధ మాట్లాడుతూ.. జిల్లా మహిళల్లో రక్తహీనత నివారణకు సకాలంలో అన్ని పీహెచ్సీలకు మందులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. మందులు వాడేందుకు సప్లయ్ చైర్ మేనేజ్మెంట్పై పూర్తిస్థాయి శిక్షణ అందించారు. అధికారులు జానా బాయి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.