బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి

Jun 13 2025 7:23 AM | Updated on Jun 13 2025 7:23 AM

బీజేప

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి

ఎల్లారెడ్డి: కేంద్రంలో 11ఏళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. ఎల్లారెడ్డిలో గురువారం కేంద్రంలో బీజేపీ పాలన పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశంలోని ప్రజలు సుఖశాంతులతో ఉన్నారన్నారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణ బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించి, నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. పట్టణ అధ్యక్షుడిగా రాజేష్‌, ఉపాధ్యక్షుడిగా కాశీనాథ్‌, పులి రమేష్‌, అల్లం స్వరూప, పోచయ్య, కార్యదర్శులుగా శంకర్‌, శ్రీను, సహాయ కార్యదర్శులుగా శివకుమార్‌, రమేష్‌, పద్మ, పండరి, కోశాధికారిగా గజానంద్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.

మున్సిపల్‌ పార్కు ప్రారంభం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ చిల్డ్రన్‌ పార్కును గురువారం కలెక్టర్‌ ఆశిష్‌ సంంగ్వాన్‌ ప్రారంభించారు. ఈ ప్రాంత పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, ఏఈ శంకర్‌, వార్డు ఆఫీసర్‌ దీప్తి, సానిటరీ ఎస్‌ఐ పర్వేజ్‌ తదితరులున్నారు.

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట స్టేషన్‌ పరిధిలో ఉన్న పెండింగ్‌ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. నాగిరెడ్డిపేట పోలీస్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిధిలో గల పెండింగ్‌ కేసులపై సమీక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్‌, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తదితరులున్నారు.

ఉపాధ్యాయుల

సమస్యలను పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్‌: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌(ఎస్‌టీయూటీఎస్‌) జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ దేవునిపల్లిలో గురువారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ సభ్యులు కుంట రాములు, ప్రవీణ్‌కుమార్‌, రాజేందర్‌, యూసుఫ్‌, కలీబుద్దిన్‌ తదితరులున్నారు.

విద్యుత్‌ షాక్‌తో దూడ మృతి

ఎల్లారెడ్డి రూరల్‌: మండలంలోని మల్లయ్యపల్లిలో విద్యుత్‌ షాక్‌తో లేగ దూడ మృతి చెందినట్లు బాధితుడు గడ్డం లక్ష్మీకాంతం గురువారం తెలిపారు. బలంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగి పడడంతో మేత మేస్తున్న లేగ దూడకు విద్యుత్‌ షాక్‌ తగిలి మరణించిందన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి1
1/3

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి2
2/3

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి3
3/3

బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement