
రక్తదానం చేసి.. ప్రాణదాతలు కండి
బాన్సువాడ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం బాన్సువాడలోని తన కార్యాలయంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మూడు నెలలకొకసారి రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. స్వచ్ఛంద సేవ సంస్థలు సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్, జిల్లా అధ్యక్షులు బంగారు రవి, సంతోష్, విఠల్, సురేష్, మహేందర్, సాయిలు, అనిల్ తదితరులున్నారు.
మారిన విద్యుత్ అధికారులు, సిబ్బంది మొబైల్ నంబర్లు
కామారెడ్డి అర్బన్: పరిపాలన కారణాలతో విద్యుత్శాఖ సిబ్బందికి ఎయిర్టెల్ సిమ్లు అందజేసినట్లు ఎస్ఈ ఎన్.శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి సర్కిల్ పరిధిలో ఆయా గ్రామాల 185 మంది క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్ సిమ్లు ఉండగా ఎయిర్టెల్ సిమ్లు కేటాయించామని, కొత్త నంబర్లను ఆయా సబ్స్టేషన్లు, కార్యాలయాల్లో ప్రదర్శిస్తారన్నారు. ఆయా గ్రామాల వినియోగదారులు గ్రూప్ల ద్వారా కొత్త నంబర్లను తెలుసుకోవాలని ఎస్ఈ సూచించారు.
ఎస్ఈ కొత్త నంబర్ 87124 81934
డీఈ టెక్నికల్ 87124 81935
డీఈ ఆపరేషన్స్ 87124 82264
ఏడీఈ (కామారెడ్డి పట్టణం) 87124 82212
ఏడీఈ (రూరల్) 87124 82190
ఏడీఈ (దోమకొండ) 87124 82141
గండిమాసానిపేటలో
వృద్ధుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని గండిమాసానిపేట గ్రామంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన తిరుచ్చి బాలయ్య (65) అనే వృద్ధుడు తనకు సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో అన్న కొడుకు వద్ద ఉంటున్నాడు. వృద్ధాప్యం పైబడడంతో మనస్తాపం చెందిన బాలయ్య ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులో బాలయ్య ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.